బెట్టింగ్ యాప్ కేసులో కీలక ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో కీలక నిందితుడైన సౌరభ్ చంద్రశేఖర్కు సంబంధించిన దాదాపు రూ.1700 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఇందులో అనేక విల్లాలు, ఖరీదైన నివాసాలు ఉన్నట్లు తెలిపింది. అటాచ్ చేసిన వాటిల్లో దుబాయ్లోని ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాలో ఉన్న ఓ విల్లా కూడా ఉన్నట్లు పేర్కొంది.