VSP: విశాఖలోని సిరిపురంలో గల బాలల థియేటర్లో శుక్రవారం తపాలశాఖ ఆధ్వర్యంలో రోజ్ గార్ మేళా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ఇచ్చారు. విశాఖలో 101 మందికి కస్టమ్స్, పోస్టల్, నేవీ, రైల్వే, తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎం.భరత్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.