PLD: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. పిడుగురాళ్లలోని పల్వరైజింగ్ మిల్లుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.