SKLM: ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు చిరస్మరణీయుడని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్, ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతిని పురస్కరించుకొని నగరంలోని పాత బస్టాండ్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఆదివారం నివాళులర్పించారు.