ATP: కరోనాపై అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గురువారం ఆదేశించారు. జిల్లాలో కరోనా తొలి కేసు నమోదు అయింది. నగరంలో ఎక్కడ అపరిశుభ్రత వాతావరణం ఉండకూడదని, ప్రభుత్వాసుపత్రిలో కరోనా వార్డులు సిద్ధంగా ఉంచాలని, అవసరమైన పరికరాలు, మందులు సిద్ధం చేసుకోవాలని వైద్య అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.