SRD: ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం తెలిపారు. తాత్కాలిక పద్ధతిలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లను నియమించుకోవాలని చెప్పారు. అవసరమైన విద్యుత్ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.