ASR: ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటితేనే మానవజాతికి మనుగడ సాధ్యమవుతుందని కొయ్యూరు ఐసీడీఎస్ సీడీపీవో విజయ కుమారి అన్నారు. పర్యావరణాన్ని పాడు చేస్తే మానవ వినాశనం తప్పదన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం పలు అంగన్వాడీ కేంద్రాల్లో మొక్కలు నాటామని చెప్పారు. గ్రామాల్లో ప్రజలకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాలని సూచించారు.