SRD: కంది మండలం ఎర్ధనూరులో భూ భారతి సదస్సును ఆర్డీవో రవీందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు భూ భారతి సదస్సులో దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలోని పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినిగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు.