ATP: కళ్యాణదుర్గం పట్టణంలో రూ.1.90 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.