VZM: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న ఎన్నికల హామీలను నెరవేర్చలేదని జైబీమ్ రావు భారత్ పార్టీ విజయనగరం పార్లమెంటరీ ఇంఛార్జ్ చిన్నం అరుణ్ కుమార్, జిల్లా అధ్యక్షులు టొంపల నరసయ్య అన్నారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల పట్టణంలోని రామతీర్థం జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై గురువారం వినతిపత్రం అందించారు.