NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏపీఐఐసీ కాలనీలో పొల్యూషన్ బోర్డ్ పక్కన స్థలంలో మొక్కలు నాటారు. ఈ ప్రాంత ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, కాలనీవాసులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.