KRNL: దళితులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలని దళిత హక్కుల పోరాట సమితి DHPS జిల్లా కార్యదర్శి మహేశ్ డిమాండ్ చేశారు. ఆదోనిలో ఇవాళ జరిగిన DHPS పట్టణ సమితి సదస్సులో ఆదోని నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దళితులపై కుల వివక్షను సహించబోమని హెచ్చరించారు. దళితులపై దాడులు జరిగితే వెంటనే కేసులు నమోదు చేయాలని కోరారు.