సత్యసాయి: పెనుకొండకి చెందిన కె.అనిత శ్రీనివాసులు కుమార్తె లహరి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ చాటింది. ఆమె 972 మార్కులు సాధించి A గ్రేడ్తో ఉత్తీర్ణత సాధించింది. లహరి సాధించిన ఈ విజయంపై పట్టణంలోని ప్రముఖులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లహరిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.