CTR: విద్యార్థులు టెన్త్ హాల్ టికెట్ చూపించి RTC బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని పుంగనూరు డిపో మేనేజర్ దేనేశష్ తెలిపారు. శనివారం అయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరీక్షలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం పూట బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బస్సులు నడుపుతామని ఆయన స్పష్టం చేశారు.