E.G: విద్యుత్ ఛార్జిల పెంపు నిరసిస్తూ వైసీపీ చేపట్టిన పోరుబాటపై అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ చార్జీలు పెంపు మీద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయమని జగన్ పిలుపునివ్వడం తుగ్లక్ చర్యలాంటిదన్నారు. తాను పెంచిన ఛార్జిల మీద తన నాయకుల చేతనే ధర్నా చేయించుకోవడం అనేది విచిత్రమైన పరిస్థితి అని ఎద్దేవా చేశారు.