SKLM: సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన నెయ్యిల కుసుమాంజలి ఇంటర్మీడియట్ పరీక్షలో 978/1000 మార్కులు సాధించింది. సత్తబొమ్మాలి మండల మాజీ PACS అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ ఆమెను అభినందించారు. పేద కుటుంబానికి చెందిన కుసుమాంజలి భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి గ్రామానికి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కోరారు.