NLR: బుచ్చి నగర పంచాయతీ పరిధిలోని రేబాల కాలువలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. దీంతో నీరు నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. ఈ కారణంగా ప్రజలు అంటురోగాల బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర పంచాయతీ అధికారులు ఇప్పటికైనా స్పందించి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.