కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ముమ్మిడివరం మండలం అన్నంపల్లి వాస్తవ్యులు మట్టపర్తి మరిడి కుమార్ కుటుంబ సభ్యులు 307 గ్రాముల వెండి శంఖంను బహుకరించారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలు అందజేశారు.