BPT: రాజమండ్రిలో కల్తీ పాలు తాగి చిన్నారులు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఆహార భద్రతా శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా ఆహార భద్రత అధికారి ప్రణీత్ కుమార్ శుక్రవారం పలు పాల డైరీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపిన ఆయన, నాణ్యతలో లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.