ELR: శిక్షణ ద్వారా సచివాలయ ఉద్యోగులు నైపుణ్యం సాధించాలని ఉంగుటూరు EOPRD చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయం హాల్లో సచివాలయ డిజిటల్, ఇంజనీరింగ్, వెల్ఫేర్ సహాయకులకు శిక్షణా తరగతులు జరిగాయి. పలు అంశాలపై రిసోర్స్ పర్సనల్ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలం 25 గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.