NLR: కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆదివారం కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్యారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 ను సంప్రదించాలని సూచించారు.