NDL: సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు పెద్ద అండగా ఉంటుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. బుధవారం పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన పల్లె శ్రీనివాసులకు మంజూరైన రూ.1,44,562 చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.