W.G: భీమవరం పట్టణంలోని మావుళ్ళమ్మ ఆలయం వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణత్యాగం చేసిన శ్రీరాములు తెలుగుజాతి ఉన్నంతకాలం ఆయనను మరవదని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.