ATP: గుత్తి పట్టణంలోని గుంతకల్లు రోడ్డులో శనివారం సాయంకాలం గ్యాస్ రీఫిలింగ్ స్థావరంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్సై గోపాలుడు మాట్లాడుతూ.. గ్యాస్ రీఫిలింగ్ చేస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడులను చేశామన్నారు. 12 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.