KRNL: ఆదోనిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ వెండి రథోత్సవం మే మొదటి వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. జాతరకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లను గురువారం మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ పరిశీలించారు. రథోత్సవం జరిగే మార్గంలో మౌలిక సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా పనులు పూర్తి చేయాలన్నారు.