CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆదివారం పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. తర్వాత వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు.