భారత జాతీయ చెల్లింపుల సంస్థ UPI ద్వారా చేసే కొన్ని రకాల లావాదేవీలకు పరిమితులను గణనీయంగా పెంచింది. ఈ కొత్త మార్పులు సెప్టెంబర్ 15, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. కొన్ని ప్రత్యేక రకాల P2M లావాదేవీలకు ఒకేసారి రూ.5 లక్షల వరకు.. 24 గంటల వ్యవధిలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్, పన్నులు, స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ చెల్లింపులకు ఇది ఉపయోగపడుతుంది.