W.G: కూటమి ప్రభుత్వం దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆచంట నియోజకవర్గ మాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి నిరసనగా గురువారం ఆచంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను వీడాలని నినాదాలు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ సోమేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు.