TPT: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తామని టీటీడీ ఛైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈనెల 27 నుంచి ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. కల్యాణ వేదిక ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.