గుంటూరు: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ పిలుపు మేరకు పొన్నూరులో అంబేద్కర్ సెంటర్లో ఇవాళ ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ కార్యదర్శి ఆరేటి రామారావు మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.