KDP: జమ్మలమడుగులో గురువారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్కానింగ్ సెంటర్లలో తనిఖీ చేశారు. DY DMHO డాక్టర్ గీత ఆధ్వర్యంలో హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి వెంకటేశ్వర్లు, సీవో శ్రీనివాసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గీత మాట్లాడుతూ.. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమన్నారు.చట్టాన్ని అతిక్రమించి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.