ATP: ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగునీరు అందించే పథకానికి రాష్ట్ర మంత్రివర్గం రూ.480 కోట్లు మంజూరు చేసింది. ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషి చేయడంతో ఈ నిధులు విడుదలయ్యాయి. అలాగే రాయదుర్గం నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు అందించేందుకు రూ.380 కోట్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.