ATP: తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తీకమాసం ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసం తొలి శనివారం సందర్భంగా ప్రత్యేక అలంకరణలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనమిచ్చారు. ఉదయాన్నే అర్చకులు వివిధ అభిషేకాలు నిర్వహించి స్వామిని అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించగా వందలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు.