W.G: ఈ ఏడాది డిసెంబరు 31లోపు ESIలో రిజిస్టర్ కాని కార్మికుల వివరాలు తణుకు బ్రాంచ్ కార్యాలయంలో నమోదు చేయించాలని ESI బ్రాంచ్ మేనేజర్ ఆనంద్ పాల్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన SPREE పథకం ద్వారా 10 మంది కంటే కార్మికులు ఎక్కువగా ఉండి, వారి నెల వేతనం రూ. 21వేల కంటే తక్కువ ఉంటే వారిని ESI పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు.