KDP: ఖాజీపేట మండలంలో మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో దివిజ.. సమానమైన, న్యాయమైన, సురక్షితమైన ప్రపంచాన్ని నిర్మించడంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమమునకు మండలంలోని సచివాలయ సిబ్బంది, వీఆర్వోలు పాల్గొన్నారు.