సత్యసాయి: గొల్లపల్లి రిజర్వాయర్ను ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు జిల్లా పర్యాటక అధికారి నరసయ్య బృందం క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేపట్టింది. రిజర్వాయర్లో పర్యాటకులను ఆకర్షించేందుకు బోటింగ్ కేంద్రం ఏర్పాటుపై అధికారులు చర్చించారు. పర్యాటకుల బస కోసం అత్యాధునిక రిసార్టులు, గదుల నిర్మాణానికి అనువైన స్థలాలను ఈ సందర్భంగా గుర్తించారు.