SKLM: పాతపట్నంలో ఉన్న డా. బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి వచ్చే నెల 2వ తేదీన జరగాల్సిన ప్రవేశ పరీక్ష వాయిదా పడినట్లు ప్రిన్సిపల్ పి. పద్మావతి తెలిపారు. 5వ తరగతి, ఇంటర్ ప్రవేశ పరీక్షలు గతంలో ప్రకటించిన మేరకు 1వ తేదీన నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.