KKD: ఎలమంచిలి యార్డు సమీపంలో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి (40) మృతి చెందినట్లు తుని రైల్వే ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మృతుడు పసుపు రంగు షర్టు, నలుపు జీన్ ప్యాంటు ధరించి ఉన్నారన్నారు. వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు