W.G: పెనుగొండ-నెగ్గుపూడి ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. అతివేగం, త్రిపుల్ రైడింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో త్రిపుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురితో పాటు, ఎదురుగా వస్తున్న వ్యక్తికి కూడా బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.