AKP: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ మునగపాకలో ‘రైతన్న మీ కోసం’ వారోత్సవాల్లో పాల్గొన్నారు. పంటల సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకుంటారన్నారు.