KDP: జమ్మలమడుగు మండలం గూడెం చెరువు రాజీవ్ నగర్ కాలనీలో ఆదివారం శ్రీ సీతారామాంజనేయ స్వామి వార్ల నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు.