E.G: మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి చేరుకోనున్నారు. అనంతరం 10:30 గంటలకు నగరంలో కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. అలాగే, 11:30 గంటలకు రాజమండ్రి నుంచి కాకినాడకు బయలుదేరి వెళ్తారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.