VSP: విశాఖ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్కు శుక్రవారం 15 వినతులు వచ్చాయని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావు తెలిపారు. ప్రజల నుంచి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించేందుకు ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.