GNTR: అధిక వర్షాల కారణంగా తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరం, కొలనుకొండ, గుండిమెడ, కుంచనపల్లి గ్రామాల్లోని రైతుల పంట పొలాలు నీట మునిగాయి. డ్రైనేజ్ కాలువలు పూడిపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు గురువారం ఆరోపించారు. వడ్డేశ్వరం నుంచి గుండిమెడ వైపు వెళ్లే రహదారిని సైతం గండికొట్టి నీటిని బయటకు పంపే పరిస్థితి నెలకొందని రైతులు తెలిపారు.