BPT: మసీదులలో పనిచేసే మౌజనులు,ఇమామ్లకు11 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని చీరాలకు చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కబీర్ చెప్పారు. జిల్లా వైసీపీ మైనార్టీ నాయకులతో కలిసి ఆయన సోమవారం ఈ విషయమై బాపట్ల జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఐదు పూటలా మసీదులలో నమాజ్ చేయించే వారికి మరో పని చేసుకునే అవకాశం ఉండదన్నారు.