VZM: మెరకముడిదాం మండలం బైరిపురం బాదంపెంటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన స్థలం ఆక్రమణకు గురైందని గ్రామ యువత గ్రీవెన్స్ అధికారులకు అందించారు. ఎమ్మార్వో సులోచన రాణి ఆదేశాలతో శుక్రవారం గ్రామ సర్వేయర్, వీఆర్వో కలిపి సర్వే నంబర్ 31-15A 85 సెంట్లుకు సంబంధించి విచారణ చేపట్టి హెచ్చరిక బోర్డు, హద్దులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాంబాబు పాల్గొన్నారు.