బాపట్ల అప్పికట్ల రోడ్డులోని యారకాలువలో ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల్లో వంశీకృష్ణ మృతదేహం మంగళవారం ఉదయం లభ్యమైంది. సోమవారం సాయంత్రం మద్యం మత్తులో ఈత పోటీకి దిగి వంశీ, చందు అనే స్నేహితులు నీటిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అధికారుల గాలింపు చర్యల తర్వాత వంశీ మృతదేహం బయటపడటంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.