KDP: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అలఖాన్ పల్లి గ్రామానికి చెందిన దస్తగిరిని నిన్న రాత్రి రిమ్స్ ఆసుపత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసిన వెంటనే మాజీ సురేష్ కుమార్, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు, తదితరులు మృతదేహాన్ని పరిశీలించారు.