ATP: వైసీపీ పాలనలో రాయలసీమలోని 102 సాగునీటి ప్రాజెక్టులను జగన్ రద్దు చేశారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. హంద్రీనీవా కోసం నాడు టీడీపీ రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ కనీసం రూ. 2 వేల కోట్లు కూడా కేటాయించలేదని మండిపడ్డారు.