KRNL: రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే ఈ రెవెన్యూ సదస్సులని పెద్దకడబురు మండల తహసీల్దార్ శ్రీనాథ్ అన్నారు. మంగళవారం మండలంలోని చిన్నకడబూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. పలువురు రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి 45 రోజుల్లోగా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.